Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోదీ, ఈడీకి భయపడేది లేదు.. ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం : మంత్రి కేటీఆర్‌

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రెండు రోజుల క్రితం తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చింది. ఈ దేశంలో అద్భుతమైన మహానటుడు ఉన్నాడు. అతన్నిపంపితే ఆస్కార్‌ తప్పకుండా వచ్చేది. 2014లో ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద పడుతున్నాడు. పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, దేశాన్ని ఆగం చేయాలని చూస్తున్నాడు. ఆయనను మహానటుడు అని ఉట్టిగానే అనలేదు. ఇలా నాటకాలు ఆడుతున్నందుకే మహానటుడు అని అన్నాను. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తాను అన్నాడు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తెస్తానని చెప్పిండు. దాన్ని గురించి అడిగితే తెల్ల ముఖమేస్తున్నాడు అని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img