Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

మోదీ మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రధాని : కేసీఆర్‌

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి వివక్ష ప్రదర్శిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రం తీరును దుయ్యబట్టారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం సభకు హాజరైన సీఎం కేసీఆర్‌… కేంద్ర విద్యుత్‌ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ప్రసంగించారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క ఆర్డినెన్స్‌తో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను లాగేసుకుందని కేసీఆర్‌ అసెంబ్లీలో మండిపడ్డారు. సీలేరు పవర్‌ ప్లాంట్‌నూ లాక్కున్నారని, ఆ సమయంలో ప్రధానిని తానొక్కడినే వ్యతిరేకించానని తెలిపారు. ఎదుటివాళ్లు చెబితే వినే సంస్కారం బీజేపీ నేతలకు లేదన్నారు. కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉందని కేసీఆర్‌ తెలిపారు. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్‌ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారన్నారు. విద్యుత్‌ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని,. కేంద్రం తెస్తున్న విద్యుత్‌ సంస్కరణ అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. రఘునందన్‌ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తున్నారు. ప్రధాని నరేం?ద్ర మోదీ.. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డామన్న కేసీఆర్‌.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో చాలామంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్‌ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రధాని అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలోని శ్రీకాకుళంలో మీటర్ల పెడితే రైతులు ఆందోళన చేశారని కేసీఆర్‌ తెలిపారు. కేంద్రం విధానాలపై యూపీ సహా అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. ఇది రాచరికం కాదని ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఏమాత్రం చెప్పకుండా.. కనీసం చర్చ జరగకుండా విద్యుత్‌ బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img