కూనంనేని సాంబశివ రావు
సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో జరగట్లేదని, సిద్దిపేట రాష్ట్రంలో ఒక భాగం మాత్రమేనని సీపీఐ నేత కూనంనేని సాంబశివ రావు అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అసమర్థ పాలన నడుస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో వడ్లు కొనని పరిస్థితి దాపురించిందన్నారు.అందుకే రైతులు మరణిస్తున్నారని అన్నారు.ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పాలిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ రంగలకు అప్పగిస్తుందని చెప్పారు.