తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నెల 19, 20 తేదీల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సాధారణంగా మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చిలోనే వీస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.