బండి సంజయ్పై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపాటు
నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు నిలదీస్తే బండి సంజయ్ గుండాలతో దాడి చేయించాడు అని పేర్కొన్నారు. గత ఆరేళ్లగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయి అని, ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్ చిచ్చు పెడుతున్నాడని అన్నారు.