రేపటి నుంచి పట్టాలపై పరుగులు తీయనున్న సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణ ఛార్జీలను రైల్వే శాఖ వెల్లడిరచింది. విశాఖ – సికింద్రాబాద్ మధ్య ఒక్కరికి చైర్ కార్ ధర రూ. 1,720 , ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ధర రూ.3,170. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి రూ.905 (ఛైర్ కార్), రూ.1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) ఇక సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రూ.1365 (ఛైర్ కార్), రూ.2485 (ఎగ్జిక్యూటివ్ క్లాస్). ఈ టిక్కెట్ ధరలో క్యాటరింగ్ ఛార్జీలు కూడా ఉన్నాయి..భోజన సదుపాయం వద్దనుకుంటే ఛార్జీలు కాస్త తగ్గుతాయి..