Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

వేటికి భయపడొద్దు..మీ వెంటే మేమంతా…: కేటీఆర్‌

కొవిడ్‌ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా మనవవత్వంతో సోనూసూద్‌ సేవాభావం చాటుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కోవిడ్‌ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ నటుడు సోనూసూద్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్‌.. సోనూసూద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన సేవాధృక్పథాన్ని కొనియాడారు.సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభం అని, బాధ్యతగా సేవ చేయడం గొప్ప విషయం అని అన్నారు. సోనూ సూద్‌ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలు చేశారని, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. వీటిన్నింటికీ సోనూ భయపడాల్సిన అవసరం లేదని, సోనూ రియల్‌ హీరో అని ఉద్ఘాటించారు మంత్రి కేటీఆర్‌. తామంతా సోనూ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు. ‘మంచి పనులు చేస్తూ ఉండాలని, సోనూతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. అనంతరం సోనూసూద్‌ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌ లాంటి నేతలు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదన్నారు. తెలంగాణ నుంచే ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని సోనూసూద్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img