మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యపేట జిల్లా కేంద్రంలో ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్మీ ప్రీ రిక్రూట్మెంట్ ర్యాలీని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. దివంగత కల్నల్ సంతోశ్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ర్యాలీకి తరలి వచ్చిన వారందరిని అభినందించారు. సమాజం, దేశం మనదే అనగలిగినప్పుడే భవిష్యత్ ఉంటుందన్నారు. అలాంటి భవిష్యత్ కల్పించేందుకు ఆర్మీ దోహదపడుతుందని అన్నారు. దేశ రక్షణలో యువత భాగమవ్వాలని చెప్పారు. కల్నల్ సంతోశ్ బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో ఎంపికైన రెండు నెలలపాటు శిక్షణ అందిస్తారని, వారందరికి భోజన సౌకర్యాలు కల్పిస్తానని మంత్రి ప్రకటించారు.