Friday, April 26, 2024
Friday, April 26, 2024

వేరుశనగ పంట సాగును పెంచుతాం

: మంత్రి నిరంజన్‌ రెడ్డి
రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని, అంతర్జాతీయంగా దీనికి డిమాండ్‌ ఉందని మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. నల్లగొండ పర్యటనలో భాగంగా ఆయన ఓ రైతు పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును పెంచుతామని వెల్లడిరచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని, త్వరలో సాగు విస్తీర్ణాన్ని 6 లక్షల ఎకరాలకు పెంచుతామని తెలిపారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఈ పంటకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దేశంలో అత్యధికంగా గుజరాత్‌ తర్వాత తెలంగాణ రాష్ట్రం పల్లీ పంటను సాగు చేయబోతున్నదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img