కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని, అంగన్వాడీ సహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.