: మంత్రి కేటీఆర్
అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేసి, కేవలం ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయవాదం గురించి పెద్దగా మాట్లాడే పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవమానకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. సాయుధ దళాల్లో పని చేసిన సైనికులను మనం గౌరవించుకోవాలి కానీ ఆర్థిక భారంగా పరిగణించరాదు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు.