ఈ నెల 11న (శుక్రవారం) సీఎం కేసీఆర్ జనగామలో పర్యటించనున్నారు.సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.