Friday, April 26, 2024
Friday, April 26, 2024

28న ములుగు జిల్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈనెల 28వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ములుగు జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కిన సంగతి తెలిసిందే. రామప్పను సందర్శించేందుకు విచ్చేయనున్న రాష్ట్రపతి ముర్ము.. రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img