Friday, April 26, 2024
Friday, April 26, 2024

11న కొత్తగూడెంలో సీపీఐ ప్రజా గర్జన.. లక్ష మందితో భారీ బహిరంగసభ

బీజేపీ కో హఠావో.. దేశ్‌ కో బచావో పేరుతో నెల రోజులపాటు నిర్వహించిన ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ నెల 11న కొత్తగూడెంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. సీపీఐ ప్రజా గర్జన పేరుతో కొత్తగూడెంలోని ప్రకాశం గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ సభలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాల కొనసాగింపు, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణను ప్రకటించనుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, పోరాటాలకు సంబంధించి నాయకులు దిశా నిర్దేశం చేస్తారన్నారు. ఈ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, కార్యదర్శులు కే నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, నాయకులు చాడా వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి తదతరులు హాజరవుతారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img