మంత్రి హరీశ్రావు
దళితబంధు పథకాన్ని అడ్డుకుంటే దళితుల ఉసురు తగిలి.. ఆ కుట్రల్లో మాడి మాసై పోతారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హెచ్చరించారు.హుజూరాబాద్ సిటీ సెంటర్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామంటే.. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆరునూరైనా సరే అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి దళిత బంధు అందించి తీరుతామన్నారు. ఈ పథకాన్ని ఆపాలని హైకోర్టులో కేసులు వేశారు. ఈసీకీ లేఖలు రాస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అత్యంత పారదర్శకమైన పద్దతుల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.