Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఆశా కార్యకర్తల సహకారం ఎంతో గొప్పది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్‌ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.ఆశ కార్యకర్తలకు స్మార్ట్‌’ఫోన్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశా కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశా వర్కర్లు చేసిన సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img