రేవంత్రెడ్డి
నీళ్లు, నిధుల పేరుతో సీఎం కేసీఆర్ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నియామకాలు మన చేతుల్లోకి వస్తాయన్నారు. నీళ్లు, నియామకాలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారని అన్నారు. ‘నీళ్లు, నిధులు పేరుతో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఆయన అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలి. విద్యుత్ ప్రాజెక్టుల్లోనే కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల అవినీతి చేశారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసురుతున్నా, సీబీఐ విచారణ వేయించండి..కేసీఆర్ అవినీతిని నేను నిరూపిస్తా.. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని రేవంత్ రెడ్డి అన్నారు.