తాను క్యాసినో బిజినెస్ చేస్తానని.. అందులో తప్పేముందని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నాలుగో రోజు ఈడీ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు ప్రాణహాణి ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని.. ఇకపైనా వాటిని కొనసాగిస్తానని చీకోటి ప్రవీణ్ చెప్పారు. తనకు ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని.. విచారణ పూర్తయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.