తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జర్నలిస్ట్ పాస్లు ఉన్నవారికి గుడ్న్యూస్ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గుడ్ న్యూస్ ఫర్ అవర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ఆంగ్లంలో ట్వీట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ నుంచి వ్యాలీడ్ బస్పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు ఇకపై తమ టికెట్లపై రాయితీని ఆన్లైన్లోనే పొందవచ్చని తెలిపారు. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా జర్నలిస్టులు తమ కన్సెషన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడిరచారు.
మరోవైపు వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న పెళ్లి జంటకు కానుకలు ఇచ్చే కార్యక్రమానికి ఎండీ వీసీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని కొంపల్లి వేదికగా పెళ్లి చేసుకున్న వరుడు ఆకుల భరత్కుమార్, వధువు సౌమ్యలకు డ్రైవర్లు ముత్యాల అంజనేయులు, పబ్బాటి గణేష్ జ్ఞాపికను బహూకరించి ఆశీర్వదించారు.