టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రమాణస్వీకారం చేయించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు.