స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఉదయం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ జిల్లాలోని కోటగిరి మండలంలో గ్రామాలకు వెళ్లారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అధికారులను వెంటబెట్టుకొని ట్రాక్టర్ నడుపుతూ టాక్లి, సోంపూరు గ్రామాలకు వెళ్ళారు. అలాగే పలువురు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా జనం ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు.. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు.