Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

ఇటీవలే కురిసిన వర్షానికి హైదరాబాద్ లోని కళాసిగూడలో ఓ చిన్నారి నాలాలో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరో విషాద ఘటన జరిగింది. తాజాగా… నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నగరంలోని జూబ్లీహిల్స్ లో గల రోడ్ నెం.45లో ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. వివేక్ మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విషాద ఘటనపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img