Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా..దళిత బంధు

ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ, తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలన్నారు. దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని.. కానీ, కోవిడ్‌ వ్యాప్తి కారణంగా ఏడాది ఆలస్యమైందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింపజేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img