Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత హాకీ జట్టుకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్‌ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ ప్రీత్‌ను, జట్టు క్రీడాకారులను సీఎం ప్రశంసించారు. మహిళా బాక్సింగ్‌ కేటగిరీలో తొలిసారి బరిలోకి దిగి కాంస్యం సాధించిన అస్సాంకు చెందిన భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ని సీఎం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img