Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మాజీ మంత్రి నాయినికి నరసింహారెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళులు

మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ ఘన నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి కేటీఆర్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లోయర్‌ ట్యాంక్‌బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్‌ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img