Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

మరోసారి హైదరాబాదులో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయ్యింది. ఎల్బీనగర్‌ లో ఎస్‌ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించి 900 కేజీల నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డీసీఎం, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్న ఎస్వోటీ పోలీసులు. వారిని రిమాండ్‌ కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img