Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు

తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. నగరంలోని హయత్‌నగర్‌లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. బాధితుడు సూడాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదని అధికారులు తెలిపారు. తాజా కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25కి చేరింది. హయత్‌నగర్‌లో కొత్త వేరియంట్‌ కేసు నమోదవ్వడంతో వైద్యఆరోగ్య సిబ్బంది అప్రమత్తమైంది.బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img