Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

గోనుగుంట్ల సూర్యనారాయణనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి..

బిజెపి అండ్ వరదాపురం సూరి వర్గీయులు
ఫోటో నెంబర్ 12
విశాలాంధ్ర ధర్మవరం:: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బిజెపికి కేటాయించడం పట్ల ప్రజలు ఆమోదం అర్షనీయమని, ఇందులో భాగంగా స్థానికుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ వేలాదిమంది నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కలిసి ధర్మవరం పట్టణంలో దాదాపు 7వేల మందితో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బిజెపి జెండాలు రేపరెపలాడుతూ జోరుగా నినాదాలు మారుమోగాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిన మహనీయుడు గోనుగుంట్ల సూర్యనారాయణనే తెలిపారు. ధర్మవరం ప్రాంతం అభివృద్ధి సాధకుడు, ప్రజానాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. గత రెండు రోజులుగా కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలను ఇక్కడి ప్రజలు, కార్యకర్తలు, మనోభావాలు దెబ్బతినడంతో నాడు ధర్మవరం పట్టణంలో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేడు ధర్మవరం పట్టణంలో ప్రజల గుండెల్లో కొలువైన గోనుగుంట్ల సూర్యనారాయణకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని తెలిపారు. స్థానికేతరుడు పొరపాటున కూడా రాకూడదని అధిష్టాన పెద్దలకు వారు విన్నవించుకున్నారు. మొత్తం మీద ఈ ర్యాలీ విజయవంతం కావడంతో నియోజకవర్గ బిజెపి నాయకులు, గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img