Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాలకు సిద్ధం

క్వీన్స్ ఎన్ఆర్ఐ సీఈవో తుమరాడ చంద్రమౌళి
విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సీఈవో తుమరాడ చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆయన పార్వతీపురం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యంజిల్లాలో ఏప్రాంతంలోనైనా సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య సేవలతో ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను తమ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ద్వారా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన ప్రముఖ వైద్యుల వైద్యసేవలతోపాటు కొన్నిరకాల మందులు, కొన్నిరకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వేసవితోపాటు రానున్నసీజన్లో ప్రజలకు పలురకాల రోగాలువచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే దీర్ఘకాలిక రోగులకు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తాను జిల్లాలోని కొమరాడ మండలం మాదలంగి గ్రామానికి చెందినవాడనని,అందుకే మన్యంజిల్లా అంటే తనకు అమితమైనఇష్టమన్నారు. ఈనేపథ్యంలో తనవంతుగా జిల్లాప్రజలకు వైద్యపరమైన సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాబట్టి జిల్లాలోని అధికారులు, రాజకీయ నాయకులు, పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి వైద్య శిబిరాలను ఏర్పాటుచేస్తే తమ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలకు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img