Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలి 

విశాలాంధ్ర- సీతానగరం: మూడుజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థిగా టీడీపీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని టీడీపి రాష్ట్ర పరిశీలకులు గోవిందరాజులు, నియోజక వర్గ ఇంచార్జి, మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెలిపారు.బుధవారం వారంతాకలిసి మండలంలోని జోగమ్మ పేటలోను, గ్రామంలోగల కెజిబివి, ప్రతిభా, సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ కళాశాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.పట్టభద్రుడైన ప్రతీఓటరు తమ అమూల్యమైన ఓటును ఆలోచన చేసి విజ్ఞుడైన చిరంజీవిరావుకు వేయాలని కోరారు. విద్యావంతుడైన చిరంజీవిరావును గెలిపిస్తే పట్టభద్రులు సమస్యలపట్ల అవగాహన ఉన్నందున వారిసమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తారని చెప్పారు. వారందరికీ కరపత్రాలు అందజేసి మద్దతు పలకాలని కోరారు.
ఈకార్యక్రమంలోటిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొల్లితిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పెదభోగిలిసర్పంచ్ తేరేజమ్మ గరికయ్య, టీడీపి నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బోను చంద్రమౌళి, బుడితిశ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు,సింహాచలం నాయుడు, బి లక్ష్మణ, యోగేశ్వరరావు, శంకరరావుమాస్టారు, చింతాడ సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img