Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నియామ‌కానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

జిల్లా కోర్టు ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తి బి. సాయి క‌ల్యాణ్‌ చ‌క్ర‌వ‌ర్తి

విశాలాంధ్ర – విజ‌య‌న‌గ‌రం: బొబ్బిలి కోర్టులో సేవ‌లందించేందుకు గాను స్పెష‌ల్ జ్యుడీషియ‌ల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నియామ‌కానికి అనుభ‌వజ్ఞులైన‌ అభ్య‌ర్థుల‌ నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న‌ట్లు జిల్లా కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి. సాయి క‌ల్యాణ్‌ చ‌క్ర‌వ‌ర్తి సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు పరిధిలో సేవ‌లందించిన వారు, ఏదైనా ప్ర‌భుత్వ కార్యాల‌యంలో గెజిటెడ్ హోదాలో ప‌ని చేసి రిటైర్ అయిన వారు, న్యాయ‌వాదిగా బార్ కౌన్సిల్‌లో సేవ‌లందించిన వారు అర్హుల‌ని పేర్కొన్నారు. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఫిబ్ర‌వ‌రి 17వ‌ తేదీ లోగా న‌మూనా ప్ర‌కారం ద‌ర‌ఖాస్తుల పూర్తి చేసి జిల్లా కోర్టులో అంద‌జేయాల‌ని సూచించారు. ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.30,000 గౌర‌వ వేతనం అందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img