ఎంపీ కోటగిరి శ్రీధర్…
విశాలాంధ్ర`ముదినేపల్లి : అర్హులందరికీ అందరికీ సంక్షేమ పథకాలు అందించడం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం అని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. మండలంలోని చిగురుకోట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం 100వ రోజు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావుతో పాటు ఎంపీ శ్రీధర్ పాల్గొని ఎంపీపీ రామిశెట్టి అధ్యక్షతన కేక్ కట్ చేసి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ పార్టీ విజయానికి కార్యకర్తలు ప్రాముఖ్యమని వారిలో విశ్వాసాన్ని పెంచే విధంగా నాయకులు కృషి చేయాలన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ఆర్థిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డిఎన్ఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఘంటా సంధ్య , రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరు శ్రీదేవి , జడ్పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ , ఎంపీటీసీ పేరం నాగలక్ష్మి , పార్టీ మండల అధ్యక్షులు మోట్రు ఏసుబాబు , కోమటి విష్ణువర్ధన్ , వైస్ ఎంపీపీలు చొప్పర్ల సునీత , రాసూరి రాధ , బోర్రా శేషుబాబు , శీలం రామకృష్ణ , కరేటి గోవిందరాజులు , నిమ్మగడ్డ బిక్షాలు , నాయకులు , అధికారులు , సచివాలయం సిబ్బంది , వాలంటీర్లు , పాల్గొన్నారు.