Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంద్రబాబుపై రాళ్ల దాడి హేయమైన చర్య…

టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర -ఏలూరు: టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాళ్లదాడి హేయమైన చర్య అని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విద్యావంతుడు,మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా నిరసన తెలపాలని వీధి రౌడీలా చొక్కా విప్పుకొని తను అనుచరుల చేత రాళ్ళ దాడి చేయించడం వైసీపీ ప్రభుత్వం దాష్ఠీకానికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర ప్ర్రాపకం, పదవిని కాపాడుకోవడం కోసం ఇంత నీచానికి దిగజారడం సిగ్గు చెటనన్నారు. నీకు దమ్ముంటే దళితులు, మైనారిటీలు, మహిళల మీద దాడులు నియంత్రించాలని సవాల్ విసిరారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్ మంత్రి ఆదిమూలం సురేష్ ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. లేదా మంత్రి పదవిలో ఒక క్షణం కూడా కొనసాగే అర్హత లేదని తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img