Friday, April 26, 2024
Friday, April 26, 2024

మైసూరులో జరిగే నేషనల్ సెమినార్ కు రంగరాజు మాష్టార్ ఎంపిక….

విశాలాంధ్ర- ఉండి : కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వ విద్యాలయం మైసూరులో జరిగే జాతీయ సెమినార్ కు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకు వాడకు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు, కవి, రచయిత గాదిరాజు రంగరాజు ఎంపిక అయినట్లు ఆయన గురువారం తెలిపారు. శుక్ర, శనివారం రెండు రోజుల పాటు నిర్వహించే సెమినార్ లో తొలి సదస్సుకు నిర్వహణ బాధ్యతలు స్వికరిస్తున్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటి డీన్ ఆచార్య మొగరాల రామనాధం నాయుడు అధ్యక్షత వహిస్తారు. నాల్గవ విభాగం లో తాను పత్ర సమర్పణ కూడా చేస్తున్నట్టు తెలిపారు. సదస్సును విశ్వావిద్యాలయం ఉప కులపతి ఆచార్య శరణప్ప ప్రారంభిస్తారన్నారు. అసోసియేట్ ప్రొపసర్ చక్రవర్తి నిర్వహణ చేస్తున్నారన్నారు.ఇంతకు ముందు తాను చెన్నై, ముంబయి, బెంగుళూరు, రాజమహేంద్ర వరం, గన్నవరం, అనంతపురం తదితర ప్రాంతాల్లో అంతర్జాతీయ, జాతీయ సెమినార్ ల్లో సుమారు 10కి పైగా పత్ర సమర్పణ చేసినట్లు చెప్పారు.తనకు అవకాశం కలిపించిన తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య ఎం. రామనాధం నాయుడుకు రంగరాజు ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img