Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాలనలో జగన్ విఫలం

కొయ్యలగూడెం: రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ విఫలం చెందారని టిడిపి పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలో బోడి గూడెం గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పరిపాలన విధానం చూస్తుంటే పేద ప్రజలు రాబోవు రోజుల్లో బ్రతకడానికే కష్టంగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో సామాన్య మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఓటు రూపంలో జగన్ కు కనువిప్పు కలిగేలా చేస్తారన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై రాష్ట్రంలో అనేక అత్యాచారాలు, ఎక్కువ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, మండల మహిళా నాయకురాలు ఆకుల అరుణ, పెండ్యాల రమాదేవి, నక్క రవి,కోడెల్లి వెంకటేష్, బెల్లన శ్రీనివాస్, బొమ్మ గంటయ్య, చెరుకూరి రమ్య, కాకి లక్ష్మి, శుక్ల బోయిన సత్యనారాయణ, కేసు బాబు, మదన్, షేక్ బాజీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img