Friday, April 26, 2024
Friday, April 26, 2024

ధరల భారాలను తగ్గించాలి

చింతలపూడి: పెంచిన ధరల ధారాలను తగ్గించాలని టిడిపి మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లింగగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మేడా యల్లప్ప గూడెం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు , పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న రేట్లు కు ఈనాడు వైసిపి ప్రభుత్వంలో ఉన్న రేట్లు కు గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనిచాలన్నారు.ఈ కార్యక్రమంలో లింగగూడెం గ్రామపంచాయతీ నాయకులు గుత్త నరసింహారావు, కొరిపల్లి పాపారావు, సత్యనారాయణ,వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img