Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గీత కులాల ఐక్యతకు కృషిచేసిన గౌతు లచ్చన్న….

విశాలాంధ్ర- ఏలూరు: గీత కులాల ఐక్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సురగాని రవిశంకర్ కొనియాడారు.
సర్దార్ గౌతు లచ్చన్న,వర్ధంతి సందర్భంగా బుధవారం గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం,బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూరగాని రవిశంకర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం తరఫున బీసీలకు బీసీల రిజర్వేషన్లకు కృషి చేసిన గొప్ప వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు ఈడే శివ శంకర్ రావు, గౌరవ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు మారగాని శ్రీనివాస్, మన్నే వెంకట సుబ్బారావు, మట్టా నాగేంద్ర ,చిట్టి బొమ్మ రాంబాబు,మురాల లక్ష్మణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img