పశ్చిమబెంగాల్లో భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం భారీ సాయుధ బలగాల భద్రత నడుమ ప్రారంభమైంది.టీఎంసీ అభ్యర్థి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీకి చెందిన న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ పోటీ పడుతున్నారు.ప్రతిష్ఠాత్మక మైన భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో కేంద్రం 15 కంపెనీల బలగాలను మోహరించింది.భవానీపూర్ తో పాటు జంగిపూర్, షంషేర్ జంగ్ అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ భారీభద్రత మధ్య సాగుతోంది.