: సజ్జల
ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్రమైన కార్యక్రమమని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ప్రతి ఎన్నిక విశ్వసనీయతను తెలిపే విధంగా ఉండాలన్నారు. బద్వేల్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ప్రతిఒక్కరికి జరిగిన ప్రయోజనంపై తెలియజేప్పెందుకు బద్వేలు ఉపఎన్నికల రూపంలో వచ్చిందన్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు చేసిన కార్యక్రమం గురించి వివరించాలని చెప్పారు. బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలన్నారు.