Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పాత్రికేయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

మంత్రి ఎర్రబెల్లి
పాత్రికేయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నవంబర్‌ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాత్రికేయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.నిస్వార్ధంగా పనిచేస్తూ, సామాజిక అంశాలపై కూడా బాధ్యతతో వ్యవహరించే వారు పాత్రికేయులని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కొనియాడారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి, చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయుల కృషి గణనీయమైందని అన్నారు. పత్రికలలో చదివే వార్త కూడా మరెవరో వ్రాసింది కావచ్చు కానీ ఆ పాత్రికేయులు వ్రాసిన వార్త చదువుతుండగా సొంత విశ్లేషణ మనసులో మొదలు పెట్టుకుని అవకాశం పాఠకునికి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img