మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్
శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని, ప్రతి ఒక్కరూ దాని పవిత్ర తను కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ఎపీ శాసనసభలో పరిణామాలు చూస్తే ఆవేదన కలుగుతుందని చెప్పారు. శాసనసభలో సభ్యులు వినలేని, వినకూడని పదాలను మాట్లాడుతున్నారని అన్నారు.మహిళలను కూడా కించపరిచేలా శాసనసభలోనే వ్యాఖ్యలు చేస్తున్నారని, నాయకులను ఎదిరించలేక.. ఇంట్లో ఆడవాళ్లను తిట్టే పరిస్థితికి దిగజారారని విమర్శించారు. శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే… ఆ రోజు సభ్యడిని సస్పెండ్ చేసే విధానం అమల్లోకి తేవాలన్నారు. దేశవ్యాప్తంగా జరిగే స్పీకర్ల సదస్సులో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం చేయాలని అభిప్రాయపడ్డారు.