రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని రెండు స్థానాలకు కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ లలో పోలింగ్ జరుగనుంది. క్యాంపుల నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.