Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విడనాడాలి

: ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
బ్యాంకులను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ ప్రధాని మోదీ అన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండిపడ్డారు.జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విడనాడాలని సూచించారు.రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నాదని దుయ్యబట్టారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాటలు వింటుంటే నవ్వు వస్తున్నదని ఎద్దేవా చేశారు. . నేల విడిచి సాము చేస్తున్న రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. దిగజారి రాజకీయాలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడికి ప్రజలు బహిష్కరించే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తున్నారని, ఆయనపై అడ్డగోలిగా మాట్లాడడం తగదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img