టీఆర్ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలాడారని అన్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థించడానికే.. పార్లమెంటు సమావేశాలు బహిష్కరించి గ్రామాలకు వెళ్లారని విమర్శించారు. వారు యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని కోరలేదన్నారు.వానాకాలం పంట కొంటామని కేంద్రం ముందే చెప్పిందన్నారు. ఏప్రిల్లో వచ్చే పంట కొనుగోలే రైతుల అసలు సమస్యని వచ్చే పంటను కొంటారో లేదో కనుక్కొలేకపోయారని అన్నారు.