అసెంబ్లీలో తన తల్లిని కించపరిచిన వాళ్లని తన నాన్న (చంద్రబాబు నాయుడు) వదిలినా తాను వదిలిపెట్టేది లేదని నారా లోకేశ్ హెచ్చరించారు. ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నా.. అవమానించడం ఎంటంటూ ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఏదో ఒక విషయంలో బయటి లాగటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ విమర్శించారు. ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారంతా రానున్న కాలంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు. ఈ రోజు మంగళగిరిలో లోకేశ్ పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిడమర్రు రోడ్డులో డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు.డంపింగ్ యార్డు మారుస్తామని చెప్పి ఎమ్మెల్యే మాట తప్పారని దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు.