Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డీజీపీ గౌతమ్‌ సవాంగుకు చంద్రబాబు లేఖ

వైసీపీ నేతలు తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డీజీపీ గౌతమ్‌ సవాంగుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.మురళీకి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆ లేఖలో పేర్కొన్నారు. మురళికి రక్షణ కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్‌ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img