కరోనా వైరస్పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ భారత్ మరో రెండు కోవిడ్ వ్యాక్సిన్లను ఆమోదించింది. కొవావాక్స్, కార్బోవాక్స్, యాంటీ వైరల్ డ్రగ్ ‘మోల్నూపిరావిర్’లను అత్యవసర వినియోగానికి అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ ప్రకటించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్ కొవావాక్స్, కార్బోవాక్స్, యాంటీ కోవిడ్ పిల్ మోల్పూపిరావిర్లకు సెంట్రల్ డ్రగ్ అథారిటీ సీడీఎస్సీఓ ఆమోదం తెలిపినట్టు ఓ ట్వీట్లో మంత్రి తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వీటి వినియోగానికి ఆమోదం లభించిందని ట్విట్టర్ వేదికగా వెల్లడిరచారు. ’కంగ్రాట్యులేషన్స్ ఇండియా ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. కోవిడ్పై పోరాటాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ పరిధిలోని సీడీఎస్సీఏ ఒకే రోజు మూడిరటికి (వ్యాక్సిన్, పిల్) అనుమతించింది’’ అని ఆ ట్వీట్లో మాండవీయ పేర్కొన్నారు. తాజా ఆమోదంతో దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.