రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 2,707 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైందని, సంక్రాంతి తర్వాత ఊహించని రీతిలో కేసులు నమోదవుతాయని వైద్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ అంటూ రకరకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి.దీనిపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ట్విటర్లో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో లాక్డౌన్పై ఓ నెటిజన్ ప్రశ్నించగా… కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకే నిర్ణయాలు ఉంటాయని వెల్లడిరచారు. ప్రస్తుతానికైతే కర్ఫ్యూ, లాక్డౌన్ లాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేవని స్పష్టం చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే మాత్రం ప్రజారక్షణ మేరకు సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.