తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి కోరారు. గ్రామాల్లో సి.సి రోడ్లు, లింక్ రోడ్లకు నిధులు కేటాయించాలని కోరారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సిఎల్పీ నేత భట్టితోపాటు ఎమ్మెల్యే సీతక్క, శ్రీధర్ బాబులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.