Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు : కేటీఆర్‌

వైఎస్‌ షర్మిల పార్టీపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్‌ షర్మిల… పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన ఆమె రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోందని… అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. మరోవైపు షర్మిల పార్టీపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా… రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని… వైఎస్‌ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img